కొత్త స్టేడియంలోపంజాబ్ పోరు ఆరంభం
ABN , Publish Date - Mar 23 , 2024 | 04:22 AM
పంజాబ్ కింగ్స్ తన పోరును కొత్త స్టేడియంలో ప్రారంభించనుంది. చండీగఢ్ శివారులోని ముల్లాపూర్ గ్రామంలో
చండీగఢ్: పంజాబ్ కింగ్స్ తన పోరును కొత్త స్టేడియంలో ప్రారంభించనుంది. చండీగఢ్ శివారులోని ముల్లాపూర్ గ్రామంలో మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరిట పంజాబ్ క్రికెట్ సంఘం ఈ నూతన స్టేడియాన్ని నిర్మించింది. దాదాపు 33 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ స్టేడియంలో శనివారం రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ధవన్ సారథ్యంలోని పంజాబ్ జట్టు తలపడనుంది. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న ఈ స్టేడియం ఇకనుంచి పంజాబ్ ఫ్రాంచైజీకి సొంత మైదానం.