సిరీస్ పాకిస్థాన్దే
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:35 AM
స్పిన్నర్లు నోమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) ఇంగ్లండ్ను తిప్పేయడంతో ఆఖరి టెస్ట్లో పాకిస్థాన్ 9 వికెట్లతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది...
రావల్పిండి: స్పిన్నర్లు నోమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) ఇంగ్లండ్ను తిప్పేయడంతో ఆఖరి టెస్ట్లో పాకిస్థాన్ 9 వికెట్లతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 24/3తో శనివారం, మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 112 రన్స్కే కుప్ప కూలింది. అనంతరం 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 37/1 స్కోరు చేసి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 267, పాకిస్థాన్ 344 రన్స్ చేశాయి. పాక్ జట్టు స్వదేశంలో టెస్ట్ సిరీస్ నెగ్గడం 2021 తర్వాత ఇదే తొలిసారి.