Share News

ఆ ఇద్దరినిఅందుకే తీసుకోలేదు

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:20 AM

అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీ్‌సకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ను ఎంపిక చేయలేదన్న ఊహాగానాలను కోచ్‌ ద్రవిడ్‌ కొట్టిపడేశాడు. సౌతాఫ్రికా టూర్‌ మధ్యలో...

ఆ ఇద్దరినిఅందుకే తీసుకోలేదు

మొహాలీ: అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీ్‌సకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ను ఎంపిక చేయలేదన్న ఊహాగానాలను కోచ్‌ ద్రవిడ్‌ కొట్టిపడేశాడు. సౌతాఫ్రికా టూర్‌ మధ్యలో బ్రేక్‌ కావాలని ఇషాన్‌ కోరడంతో అంగీకరిచామని తొలి టీ20 మ్యాచ్‌కు ముందు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రవిడ్‌ చెప్పాడు. అయితే, స్వదేశంలో అఫ్ఘాన్‌తో సిరీ్‌సకు తాను అందుబాటులో ఉంటానని ఇషాన్‌ సమాచారం అందించలేదన్నాడు. అతడు మళ్లీ భారత జట్టులోకి రావాలంటే.. దేశవాళీ టోర్నీలో ఆడి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. మరోవైపు టీ20ల్లో జితే్‌షకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కాగా, అయ్యర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ వస్తున్న వార్తలను కూడా ద్రవిడ్‌ ఖండించాడు. అయితే, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సను దృష్టిలో ఉంచుకొని ముంబై తరఫున శ్రేయాస్‌ రంజీ మ్యాచ్‌లు ఆడనున్నాడు.

Updated Date - Jan 11 , 2024 | 03:20 AM