టార్గెట్..ప్లేఆఫ్స్ బెర్త్
ABN , Publish Date - May 16 , 2024 | 04:49 AM
బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా, బౌలర్లూ మెరుగ్గా రాణిస్తుండడంతో ఈ సీజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో...
![టార్గెట్..ప్లేఆఫ్స్ బెర్త్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టైటాన్స్తో సన్రైజర్స్ ఢీ నేడు
హైదరాబాద్: బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా, బౌలర్లూ మెరుగ్గా రాణిస్తుండడంతో ఈ సీజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. గుజరాత్తో గాక మరో మ్యాచ్ మిగిలున్నా.. టైటాన్స్పై గెలిస్తే సన్రైజర్స్కు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమవుతుంది. 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సాధించిన ఆ జట్టు గరిష్ఠంగా 18 పాయింట్లు పొందే చాన్సుంది. అలాగే రన్ రేట్ (+0.406) కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని నితీశ్, క్లాసెన్, సమద్ కొనసాగిస్తే రైజర్స్కు తిరుగుండబోదు. మరోవైపు 13 మ్యాచ్ల ద్వారా కేవలం 11 పాయింట్లతోనే ఉన్న గుజరాత్..ఇప్పటికే నాకౌట్ రేస్నుంచి అవుటైంది. కనీసం చివరి పోరులో గెలిచి లీగ్ను గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది. అయితే ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న సన్రైజర్స్ను అందునా..వారి సొంత గ్రౌండ్లో అడ్డుకోవడం గుజరాత్కు అయ్యేపనేనా?