Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కమిన్స్‌కు సన్‌రైజర్స్‌ పగ్గాలు?

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:40 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ ఐపీఎల్‌ సీజన్‌కు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా సారథిగా వ్యవహరించిన మార్‌క్రమ్‌కు ఉద్వాసన పలికి

కమిన్స్‌కు సన్‌రైజర్స్‌ పగ్గాలు?

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ ఐపీఎల్‌ సీజన్‌కు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా సారథిగా వ్యవహరించిన మార్‌క్రమ్‌కు ఉద్వాసన పలికి అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్‌ ప్యాట్‌ కమిన్స్‌కు పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. రికార్డుస్థాయిలో రూ. 20.50 కోట్లు వెచ్చించి వేలంలో కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది కమిన్స్‌ సారథ్యంలోనే ఆస్ట్రేలియా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పతో పాటు వన్డే వరల్డ్‌క్‌పను గెలుచుకుంది. ఈ అనుభవం దృష్ట్యా కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఫ్రాంచైజీ నిర్ణయించిందనీ, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సన్‌రైజర్స్‌ వర్గాలు తెలిపాయి. నిరుడు మార్‌క్రమ్‌ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌ 14 మ్యాచుల్లో 4 మాత్రమే గెలవడం గమనార్హం.

Updated Date - Mar 03 , 2024 | 04:40 AM