Share News

శ్రీకాంత్‌ శుభారంభం

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:08 AM

ఇటీవల వరుస టోర్నమెంట్లలో విఫలమవుతున్న భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ ఈవెంట్‌లో శుభారంభం చేశాడు.

శ్రీకాంత్‌ శుభారంభం

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

బ్యాంకాక్‌: ఇటీవల వరుస టోర్నమెంట్లలో విఫలమవుతున్న భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ ఈవెంట్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 22-20, 21-19తో చైనీస్‌ తైపీ షట్లర్‌ వాంగ్‌ జూ వీపై గెలిచాడు. మరో భారత ఆటగాడు మిథున్‌ మంజునాథ్‌ 21-17, 21-8తో జాసన్‌ గునవాన్‌ (హాంకాంగ్‌)ను చిత్తుచేసి కిడాంబి శ్రీకాంత్‌తో రెండోరౌండ్‌ పోరుకు సిద్ధమయ్యాడు. మిగతా భారత షట్లర్లలో శంకర్‌ ముత్తుస్వామి 21-14, 21-17తో లియోంగ్‌ జున్‌ (మలేసియా)పై, అస్మిత చాలియా 21-10, 21-16తో వోంగ్‌ లింగ్‌ (మలేసియా)పై, మాళవికా బన్సోద్‌ 22-20, 21-8తో ఇనెస్‌ లూసియా (పెరూ)పై గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జ్‌ ప్రత్యర్థుల చేతిలో ఓడి ఆదిలోనే వెనుదిరిగారు.

Updated Date - Feb 01 , 2024 | 04:08 AM