Sindhu : సింధు శుభారంభం
ABN , Publish Date - May 30 , 2024 | 06:21 AM
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-12, 22-20తో లైన్ హోజ్మార్క్ (డెన్మార్క్)పై
![Sindhu : సింధు శుభారంభం](https://media.andhrajyothy.com/media/2024/20240511/Untitled_7_112ddd0d9d.jpg)
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-12, 22-20తో లైన్ హోజ్మార్క్ (డెన్మార్క్)పై నెగ్గింది. ప్రణయ్ 21-9, 18-21, 21-9తో జూలియన్ కరాగీ (బెల్జియం)పై గెలుపొందాడు. లక్ష్యసేన్ 13-21, 21-16, 13-21తో అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. ఐదోసీడ్ కొడాయి నరవొక (జపాన్)తో పోరులో 14-21, 3-11తో వెనుకంజలో ఉన్న దశలో కిడాంబి శ్రీకాంత్ మోకాలి గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-7, 21-14తో చెంగ్ యు పె-సన్ యు హిసింగ్ (చైనీస్ తైపీ) ద్వయాన్ని ఓడించి రెండో రౌండ్ చేరింది.