సింధు ఇంటి దారి
ABN , Publish Date - Jun 06 , 2024 | 04:48 AM
ఇండోనేసియా ఓపెన్లో ఏస్ షట్లర్ పీవీ సింధుకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సింధు 15-21, 21-16, 14-21తో వెన్ చి (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి....
![సింధు ఇంటి దారి](https://media.andhrajyothy.com/media/2024/20240604/2_Sports_eb080a8d14.jpg)
జకార్తా: ఇండోనేసియా ఓపెన్లో ఏస్ షట్లర్ పీవీ సింధుకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సింధు 15-21, 21-16, 14-21తో వెన్ చి (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో మ్యాచ్లో రచనోక్ ఇంటనాన్ 18-21, 6-21 స్కోరుతో ఆకర్షి కశ్య్పను ఓడించింది. మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో అశ్వినీ పొన్నప్ప-తనీషా క్రాస్టో 21-15, 21-15తో కెనడాకు చెందిన జేకి డెంట్-క్రిస్టల్ లూపై గెలిచి ముందంజ వేసింది. కాగా, రితుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా జోడీ 12-21, 9-21తో కొరియాకు చెందిన కిమ్ సొ యియాంగ్-కాంగ్ హి చేతిలో పరాజయం పాలైంది.