Share News

సింధు శుభారంభం

ABN , Publish Date - May 23 , 2024 | 03:41 AM

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21-17, 21-16తో క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై...

సింధు శుభారంభం

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21-17, 21-16తో క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై గెలుపొందింది. తదుపరి రౌండ్‌లో సిమ్‌ యు జిన్‌ (కొరియా)తో సింధు తలపడుతుంది. మరో మొదటి రౌండ్‌లో అస్మిత చలిహా 21-17, 21-6తో లిన్‌ సి యున్‌పై నెగ్గి ముందంజ వేసింది. అయితే ఆకర్షీ కశ్యప్‌ 24-22, 13-21తో వాంగ్‌ ఝీ చేతిలో, ఉన్నతీ హుడా 13-21, 18-21తో ఫాంగ్‌ జీ చేతిలో, కిరణ్‌ జార్జ్‌ 16-21, 17-21తో ఒబయాషి చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌/సిక్కిరెడ్డి జోడీ 21-15, 12-21, 21-17తో లీ చున్‌/ఫు చి(హాంకాంగ్‌) జంటపై, పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌/సాయిప్రతీక్‌ ద్వయం 23-21, 21-11తో మింగ్‌/టాంగ్‌పై నెగ్గి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.

Updated Date - May 23 , 2024 | 03:41 AM