Share News

క్వార్టర్స్‌లో భారత జట్లకు షాక్‌

ABN , Publish Date - May 03 , 2024 | 02:47 AM

భారత పురుషుల, మహిళల జట్లు థామస్‌, ఉబెర్‌క్‌పల్లో ఇంటిదారి పట్టాయి. ముఖ్యంగా పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో...

క్వార్టర్స్‌లో భారత జట్లకు షాక్‌

థామస్‌, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌

చెంగ్డూ (చైనా): భారత పురుషుల, మహిళల జట్లు థామస్‌, ఉబెర్‌క్‌పల్లో ఇంటిదారి పట్టాయి. ముఖ్యంగా పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టీమిండియా చైనాతో పోరులో 1-3తో తడబడింది. భారీ అంచనాలున్న ప్రణయ్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి, ధ్రువ్‌ కపిల-సాయి ప్రతీక్‌లు ఓడగా.. లక్ష్య సేన్‌ ఒక్కడే ఊరటనిచ్చాడు. కాగా, బుధవారం ఇండోనేసియాతో మ్యాచ్‌ ఆడడంతో భారత ఆటగాళ్లు కొంత అలసిపోగా.. ఓ రోజు విశ్రాంతి లభించడంతో చైనా ప్లేయర్లు కోర్టులో పాదరసంలా కదులుతూ పైచేయి సాధించారు.


అమ్మాయిలు పోరాడారు.. కానీ..: ఉబెర్‌ కప్‌లో పీవీ సింధులాంటి సీనియర్‌ ప్లేయర్‌ దూరమైనా.. అద్భుత పోరాటంతో నాకౌట్‌కు చేరినా భారత మహిళల జట్టు అదే జోరును కొనసాగించలేక పోయింది. క్వార్టర్స్‌లో భారత్‌ 0-3తో జపాన్‌ చేతిలో పోరాడి ఓడింది. తొలి సింగిల్స్‌లో అస్మిత చలీహా, రెండో మ్యాచ్‌లో ఇస్రాని బారువా ఓటమిపాలయ్యారు. ఇక డబుల్స్‌ మ్యాచ్‌లో కొంజెంగ్‌బమ్‌-శ్రుతి మిశ్రా పరాజయం పాలవడంతో టీమిండియా ఓటమి పరిపూర్ణమైంది.

Updated Date - May 03 , 2024 | 02:47 AM