Share News

స్వర్ణంతో మెరిసినా..

ABN , Publish Date - May 21 , 2024 | 01:03 AM

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 4గీ400 మీ. రిలే విభాగంలో భారత జట్టు అదరగొట్టింది. తెలుగు అథ్లెట్‌ జ్యోతిక శ్రీ, శుభా వెంకటేశన్‌, అజ్మల్‌, జాకబ్‌తో కూడిన భారత బృందం...

స్వర్ణంతో మెరిసినా..

  • భారత్‌కు దక్కని పారిస్‌ బెర్త్‌

  • ఆసియా మిక్స్‌డ్‌ 4 గీ400 మీ. రిలే

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 4గీ400 మీ. రిలే విభాగంలో భారత జట్టు అదరగొట్టింది. తెలుగు అథ్లెట్‌ జ్యోతిక శ్రీ, శుభా వెంకటేశన్‌, అజ్మల్‌, జాకబ్‌తో కూడిన భారత బృందం సోమవారం జరిగిన రేస్‌ను 3 నిమిషాల 14.14 సెకన్ల జాతీయ రికార్డు టైమింగ్‌తో పూర్తిచేసి స్వర్ణ పతకం సాధించింది. అయితే పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది. శ్రీలంక జట్టు రజతం, వియత్నాం బృందం కాంస్య పతకం నెగ్గాయి.

Updated Date - May 21 , 2024 | 01:03 AM