Share News

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Jan 12 , 2024 | 02:08 AM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ రెండో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మలేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ముగిసిన ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ 21-11, 21-18తో...

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

కౌలాలంపూర్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ రెండో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మలేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ముగిసిన ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ 21-11, 21-18తో లుకాస్‌ కొర్వీ-రొనాన్‌ లాబార్‌ (ఫ్రాన్స్‌) ద్వయంపై నెగ్గి, ముందంజ వేసింది. గత ఏడాది సాత్విక్‌ జోడీ ఆసియా క్రీడలతో సహా ఆరు టైటిళ్లు సాధించడం తెలిసిందే. ఇక సింగిల్స్‌ రెండో రౌండ్లో కిడాంబి శ్రీకాంత్‌ 13-21, 17-21తో లాంగ్‌ అంగస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలై, టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో జోడీ 21-19, 13-21, 21-15తో వకానా నగహారా-మయు మత్సుమోటో (జపాన్‌)పై గెలిచి, క్వార్టర్స్‌లో ప్రవేశించింది.

శ్రీకాంత్‌ ఇంటిదారి

Updated Date - Jan 12 , 2024 | 02:08 AM