Share News

సాత్విక్‌ జోడీ చేజారిన నెం.1

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:37 AM

భారత డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. సింగపూర్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌లలో నాకౌట్‌కు చేరలేకపోవడం ఈ జోడీ ర్యాంకింగ్‌ను దెబ్బతీసింది...

సాత్విక్‌ జోడీ చేజారిన నెం.1

న్యూఢిల్లీ: భారత డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. సింగపూర్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌లలో నాకౌట్‌కు చేరలేకపోవడం ఈ జోడీ ర్యాంకింగ్‌ను దెబ్బతీసింది. బీడబ్ల్యూఎఫ్‌ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌ ద్వయం మూడో స్థానానికి దిగజారింది. లియాంగ్‌-వాంగ్‌ (చైనా), ఆస్ట్ర్‌ప-అండర్స్‌ (డెన్మార్క్‌) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. సింగిల్స్‌లో ప్రణయ్‌ (10), లక్ష్యసేన్‌ (14) తమ ర్యాంకుల్ని నిలబెట్టుకున్నారు. ఇక కిడాంబి శ్రీకాంత్‌ 4 స్థానాలు దిగజారి 32వ ర్యాంక్‌కు చేరగా, ప్రియాన్షు రజావత్‌ 34, కిరణ్‌ జార్జ్‌ 35వ స్థానంలో ఉన్నారు. సింధు 10వ ర్యాంక్‌లోనే ఉంది. డబుల్స్‌లో తనీషా-అశ్విని ఒక స్థానం మెరుగై 19వ ర్యాంక్‌, గాయత్రి-ట్రీసా జాలీ ద్వయం ఒక స్థానం ఎగబాకి 24వ స్థానానికి చేరింది.

Updated Date - Jun 12 , 2024 | 02:37 AM