Share News

తుది పోరుకు సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - May 19 , 2024 | 03:26 AM

భారత టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకొన్నారు. శనివారం జరిగిన సెమీ్‌సలో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-11, 21-12తో చైనీస్‌ తైపీకి చెందిన...

తుది పోరుకు సాత్విక్‌ జోడీ

బ్యాంకాక్‌: భారత టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకొన్నారు. శనివారం జరిగిన సెమీ్‌సలో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-11, 21-12తో చైనీస్‌ తైపీకి చెందిన లు మింగ్‌ చె-టాంగ్‌ కై విపై వరుస గేముల్లో అలవోకగా నెగ్గింది. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో చైనా జోడీ చెన్‌ బొ యంగ్‌-లు యితో సాత్విక్‌ ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది. 35 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Updated Date - May 19 , 2024 | 03:26 AM