మళ్లీ వరల్డ్ నెం.1గా సాత్విక్ జోడీ
ABN , Publish Date - May 22 , 2024 | 01:39 AM
ప్రపంచ బ్యాడ్మింటన్ డబుల్స్ తాజా ర్యాంకింగ్స్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ తిరిగి వరల్డ్ నెంబర్ వన్ పీఠాన్ని అధిరోహించింది. ఆల్ ఇంగ్లండ్...
![మళ్లీ వరల్డ్ నెం.1గా సాత్విక్ జోడీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/1_Sports_2ac290b6e9.jpg)
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ డబుల్స్ తాజా ర్యాంకింగ్స్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ తిరిగి వరల్డ్ నెంబర్ వన్ పీఠాన్ని అధిరోహించింది. ఆల్ ఇంగ్లండ్, ఆసియా చాంపియన్షి్పలో పరాజయం తర్వాత సాత్విక్ ద్వయం అగ్రస్థానం నుంచి తృతీయ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత సీజన్లో రెండు టైటిళ్లు నెగ్గడంతో సాత్విక్ జోడీ తిరిగి ప్రథమ స్థానానికి చేరుకుంది. సింగిల్స్లో సింధు 14 నుంచి 15వ ర్యాంక్కు పడిపోగా, ప్రణయ్ 9వ ర్యాంక్తో తిరిగి టాప్-10లో చోటు సంపాదించాడు. లక్ష్యసేన్ 14వ, కిడాంబి శ్రీకాంత్ 26వ, ప్రియాన్షు రజావత్ 33వ ర్యాంకుల్లో నిలిచారు. డబుల్స్లో తనీషా-అశ్వినీ పొన్నప్ప జోడీ 19వ స్థానంలో, ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట 29వ ర్యాంక్లో ఉన్నారు.