Share News

రన్నరప్‌ రష్మిక వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:36 AM

ఐటీఎఫ్‌ మహిళల వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక రన్నర్‌పగా నిలిచింది. ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఫైనల్లో రష్మిక 3-6, 2-6తో దలీలా జాకుపోవిక్‌ (స్లోవేనియా)

రన్నరప్‌ రష్మిక వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్‌ మహిళల వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక రన్నర్‌పగా నిలిచింది. ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఫైనల్లో రష్మిక 3-6, 2-6తో దలీలా జాకుపోవిక్‌ (స్లోవేనియా) చేతిలో ఓడింది. శనివారం డబుల్స్‌ పోటీల్లో విజేతగా నిలిచిన రష్మిక ఆ తర్వాత అస్వస్థత కారణంగా రాత్రంతా ఆస్పత్రిలోనే ఉంది. ఆరోగ్యం సహకరించకపోయినా ఫైనల్‌ బరిలోకి దిగింది. కోర్టులో రష్మిక చురుగ్గా ఆడలేకపోయినా, ప్రత్యర్థికి వాకోవర్‌ ఇవ్వకుండా ఆడింది.

Updated Date - Mar 18 , 2024 | 04:37 AM