వద్దని చెప్పినా వినరా?
ABN , Publish Date - May 20 , 2024 | 04:03 AM
క్రికెటర్ల గోప్యతను ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల కేకేఆర్తో మ్యాచ్కు ముందు తను...
![వద్దని చెప్పినా వినరా?](https://media.andhrajyothy.com/media/2024/20240511/3_Sports_6e96abbf32.jpg)
బ్రాడ్కాస్టర్పై రోహిత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: క్రికెటర్ల గోప్యతను ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల కేకేఆర్తో మ్యాచ్కు ముందు తను అభిషేక్ నాయర్తో కలిసి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అందులో ముంబై కెప్టెన్సీపై అతడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడట. ‘క్రికెటర్ల జీవితాలకు గోప్యత లేకుండా పోయింది. శిక్షణ లేదా మ్యాచ్ సమయంలో మా సహచరులు, స్నేహితులతో మాట్లాడే ప్రతీ మాటను కెమెరాలు నేరుగా రికార్డు చేస్తూ ప్రసారం కూడా చేస్తున్నాయి. అలాగే మా సంభాషణను రికార్డు చేయవద్దని స్టార్స్పోర్ట్స్ను కోరినా వినకుండా ప్రసారం కూడా చేశారు. వారికి ఎప్పుడూ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మాత్రమే కావాల’ని రోహిత్ ఎక్స్లో ఘాటుగా స్పందించాడు.