Share News

జాతీయ హాకీ ఆటగాడు వరుణ్‌పై అత్యాచార ఆరోపణలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:21 AM

భారత హాకీ జట్టు ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి మైనర్‌గా ఉన్నప్పుడే తనపై వరుణ్‌

జాతీయ హాకీ ఆటగాడు వరుణ్‌పై అత్యాచార ఆరోపణలు

పోక్సో చట్టం కింద కేసు నమోదు

బెంగళూరు: భారత హాకీ జట్టు ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి మైనర్‌గా ఉన్నప్పుడే తనపై వరుణ్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని సోమవారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద వరుణ్‌పై కేసు నమోదు చేశారు. జలంధర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల వరుణ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2018లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌ పరిచయమైనప్పుడు ఆ యువతికి 17 ఏళ్లు. ఆ సమయంలో వరుణ్‌ స్థానిక సాయ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని యువతి పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో వరుణ్‌ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్నాడు. మరోవైపు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొలీగ్‌లో ఆడేందుకు జాతీయ జట్టుతో పాటు వరుణ్‌ భువనేశ్వర్‌లోనే ఉన్నట్టు హాకీ ఇండియా వర్గాలు పేర్కొనడం గమనార్హం. 2017 నుంచి జాతీయ జట్టులో సభ్యునిగా ఉన్న వరుణ్‌.. టీమిండియా తరఫున 142 మ్యాచ్‌లు ఆడి 40 గోల్స్‌ చేశాడు.

Updated Date - Feb 07 , 2024 | 04:21 AM