Share News

లాహోర్‌లో ఆడండి..

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:47 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో లాహోర్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడాలని టీమిండియాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కోరింది. భారత జట్టుకు ఇక్కడ అత్యంత పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి

లాహోర్‌లో ఆడండి..

టీమిండియాకు పీసీబీ వినతి

లాహోర్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో లాహోర్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడాలని టీమిండియాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కోరింది. భారత జట్టుకు ఇక్కడ అత్యంత పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి తొమ్మిది వరకు జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీకి పీసీబీ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌ వెళ్లేందుకు టీమిండియా సుముఖంగా లేదు. ‘ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో వేదికకు వెళ్లే ప్రయాణ భారాన్ని తగ్గించడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు లాహోర్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకొని చాంపియన్స్‌ ట్రోఫీ ఆడాలని భారత్‌కు సూచించాం’ అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఐసీసీకి పంపిన చాంపియన్స్‌ ట్రోఫీ ముసాయిదా షెడ్యూల్‌లో ప్రతిపాదించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 11 , 2024 | 04:47 AM