ఒకటి ముందుకి-మరోటి వెనక్కి
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:32 AM
ఐపీఎల్లో రెండు మ్యాచ్లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈడెన్ గార్డెన్స్లో ఈ నెల 17న కోల్కతా-రాజస్థాన్ మధ్య మ్యాచ్ను ఒక రోజు ముందుగా.. అంటే 16న నిర్వహించనున్నారు...
![ఒకటి ముందుకి-మరోటి వెనక్కి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రెండు ఐపీఎల్ మ్యాచ్ల రీషెడ్యూల్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు మ్యాచ్లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈడెన్ గార్డెన్స్లో ఈ నెల 17న కోల్కతా-రాజస్థాన్ మధ్య మ్యాచ్ను ఒక రోజు ముందుగా.. అంటే 16న నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి పండుగ ఉన్నందున తగినంత భద్రత కల్పించలేమని కోల్కతా పోలీసులు స్పష్టం చేయడంతో.. ఆ మ్యాచ్ను ఒక రోజు ముందు నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో అహ్మదాబాద్లో 16న గుజరాత్-ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ను ఓ రోజు తర్వాతికి.. అంటే 17వ తేదీకి మార్చారు.