రిథమ్కు ఒలింపిక్ బెర్త్
ABN , Publish Date - Jan 12 , 2024 | 02:06 AM
పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనబోతున్నారు. తాజాగా 20 ఏళ్ల యువ షూటర్ రిథమ్ సాంగ్వాన్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. గురువారం జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్...
![రిథమ్కు ఒలింపిక్ బెర్త్](https://media.andhrajyothy.com/media/2023/20231205/3_Sports_3b6cc366fd.jpg)
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనబోతున్నారు. తాజాగా 20 ఏళ్ల యువ షూటర్ రిథమ్ సాంగ్వాన్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. గురువారం జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్స్ మహిళల 25 మీ. స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో కాంస్యంతో తన స్థానం ఖాయం చేసుకుంది. దీంతో ఈ ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగే ఒలింపిక్స్లో భారత్ నుంచి అత్యధికంగా 16 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో టోక్యో ఒలింపిక్స్లో 15 మంది షూటర్లు మాత్రమే భారత్ తరపున పాల్గొన్నారు.