ఖో-ఖో సెమీస్లో ఒడిశా, చెన్నై
ABN , Publish Date - Jan 07 , 2024 | 03:31 AM
అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో ఒడిశా జగర్నాట్స్, చెన్నై క్విక్ గన్స్ జట్లు సెమీఫైనల్స్ బెర్త్లు ఖాయం చేసుకున్నాయి...
కటక్: అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో ఒడిశా జగర్నాట్స్, చెన్నై క్విక్ గన్స్ జట్లు సెమీఫైనల్స్ బెర్త్లు ఖాయం చేసుకున్నాయి. శనివారం జరిగిన తొలి పోరులో ఒడిశా 30-27తో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. మరో మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్ 41-18తో ముంబై ఖిలాడి్సపై గెలిచింది. ఆదివారం ముంబై ఖిలాడి్సతో రాజస్థాన్ వారియర్స్, ఒడిశాతో తెలుగు యోధాస్ తలపడనున్నాయి.