Share News

నిఖత్‌ పసిడి పంచ్‌

ABN , Publish Date - May 19 , 2024 | 03:27 AM

వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఆమెతోపాటు మీనాక్షి కూడా పసిడి పతకంతో మెరిసింది...

నిఖత్‌ పసిడి పంచ్‌

ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌

ఆస్థానా (కజకిస్థాన్‌): వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఆమెతోపాటు మీనాక్షి కూడా పసిడి పతకంతో మెరిసింది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌ రికార్డు స్థాయిలో 12 పతకాలు సాధించింది. జరీన్‌, మీనాక్షిగాక ఇద్దరు భారత బాక్సర్లు రజతాలు, ఎనిమిదిమంది కాంస్య పతకాలు గెలుపొందారు. గత ఏడాది ఇక్కడ మన బాక్సర్లు కేవలం ఐదు పతకాలే నెగ్గడం గమనార్హం. 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్‌ 5-0తో ఝజీరా ఉరబయేవా (కజకిస్థాన్‌)ను చిత్తు చేసి టైటిల్‌ అందుకుంది. ఇక 46 కిలోల తుది పోరులో మీనాక్షి 4-1తో ఉజ్బెక్‌ బాక్సర్‌ రహమొనోవా సిదాహోన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. అనామిక (50కి.), మనీషా (60కి.) టైటిల్‌ ఫైట్‌లో ఓటమితో రజత పతకానికి పరిమితమయ్యారు.

Updated Date - May 19 , 2024 | 03:27 AM