Share News

పట్టు బిగిస్తున్న ముంబై

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:26 AM

కీలక సమయంలో రహానె (58 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో ఫామ్‌లోకి రావడంతో.. విదర్భతో రంజీ ఫైనల్లో ముంబై పట్టు బిగిస్తోంది.

పట్టు బిగిస్తున్న ముంబై

ముంబై: కీలక సమయంలో రహానె (58 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో ఫామ్‌లోకి రావడంతో.. విదర్భతో రంజీ ఫైనల్లో ముంబై పట్టు బిగిస్తోంది. ఆటకు రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ముంబై 141/2 స్కోరు చేసింది. సోమవారం ఆట ముగిసేసరికి రహానెతోపాటు ముషీర్‌ (51 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 119 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిపి ముంబై ఇప్పటికే 260 రన్స్‌ లీడ్‌ సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 31/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ 105 పరుగులకు కుప్పకూలింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 రన్స్‌ చేసింది.

Updated Date - Mar 12 , 2024 | 01:26 AM