మూనీకి గుజరాత్ పగ్గాలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:48 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథిగా ఆస్ట్రేలియా స్టార్ బేత్ మూనీ వ్యవహరించనుంది...
![మూనీకి గుజరాత్ పగ్గాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_Sports_b17111d3eb.jpg)
డబ్ల్యూపీఎల్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథిగా ఆస్ట్రేలియా స్టార్ బేత్ మూనీ వ్యవహరించనుంది. గత సీజన్లోనూ జట్టు పగ్గాలు మూనీకే అప్పగించినా.. తొలి మ్యాచ్ ఆడిన వెంటనే గాయంతో లీగ్కు దూరమైంది. దీంతో మూనీ స్థానంలో స్నేహ్ రాణా జట్టును నడిపించింది. జట్టుకు ప్రధాన కోచ్ మైకేల్ క్లింగర్ కాగా.. మిథాలీ రాజ్ మెంటార్ బాధ్యతలు నిర్వర్తించనుంది. బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా ఈనెల 23 నుంచి పోటీలు జరుగనున్నాయి.