మయాంక్ డిశ్చార్జ్
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:14 AM
విమానంలో తీవ్ర అనారోగ్యానికి గురైన కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
![మయాంక్ డిశ్చార్జ్](https://media.andhrajyothy.com/media/2023/20231205/gflkbj_99abb12800.jpg)
ఆరోగ్యంగానే ఉన్నానంటూ పోస్టు
అగర్తలా: విమానంలో తీవ్ర అనారోగ్యానికి గురైన కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రయాణం చేసేందుకు ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడంతో మరో విమానంలో బుధవారం సాయంత్రం అతడు బెంగళూరు చేరుకొన్నాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి మరోసారి పరీక్షలు చేయించుకొంటాడని సమాచారం. ప్రస్తుతం అతడికి విశ్రాంతి తప్పనిసరి కావడంతో శుక్రవారం నుంచి సూరత్లో రైల్వే్సతో జరిగే రంజీ మ్యాచ్కు దూరమయ్యాడు. 32 ఏళ్ల మయాంక్ టీమిండియా తరఫున 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.