కివీస్ విజయ లక్ష్యం 369
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:39 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్కు 369 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. ఈ ఛేదనలో కివీస్ శనివారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 111
వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్కు 369 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. ఈ ఛేదనలో కివీస్ శనివారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 111 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ (56), మిచెల్ (12) ఉన్నారు. లియోన్కు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా, కివీస్ విజయానికి 258 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతున్న ఆసీ్సను మూడో రోజున కివీస్ కట్టడి చేసింది. స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ (5/45) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్లో కంగారూలు 164 పరుగులకే పరిమితమయ్యారు. 2008 తర్వాత స్వదేశంలో కివీస్ స్పిన్నర్కు ఐదు వికెట్లు దక్కడం ఇదే తొలిసారి. బ్యాటింగ్లో లియోన్ (41), గ్రీన్ (39) మాత్రమే రాణించారు. హెన్రీకి 3, సౌథీకి 2 వికెట్లు దక్కాయి.’