Share News

అగ్రస్థానంలో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:03 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 42-27తో తమిళ్‌ తలైవా్‌సను ఓడించింది. ఈ విజయంతో మొత్తం 71 పాయింట్లతో జైపూర్‌ టాప్‌కు చేరుకుంది.

అగ్రస్థానంలో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 42-27తో తమిళ్‌ తలైవా్‌సను ఓడించింది. ఈ విజయంతో మొత్తం 71 పాయింట్లతో జైపూర్‌ టాప్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో జైపూర్‌ రైడర్లు అర్జున్‌ దేశ్‌వాల్‌ 13 పాయింట్లతో, అజిత్‌ కుమార్‌ 9 పాయింట్లతో సత్తా చాటి, ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తలైవాస్‌ రైడర్‌ నరీందర్‌ (12 పాయింట్లు) ఒంటరి పోరాటం వృధా అయింది. ఇక, పట్నా పైరేట్స్‌-బెంగళూరు బుల్స్‌ తలపడిన మరో మ్యాచ్‌ 29-29 స్కోరుతో టైగా ముగిసింది.

Updated Date - Feb 01 , 2024 | 04:03 AM