Share News

భారత్‌లోనే ఐపీఎల్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:44 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ను విదేశాలకు తరలిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ మెగా లీగ్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహిస్తామని...

భారత్‌లోనే ఐపీఎల్‌

లీగ్‌ చైర్మన్‌ ధూమల్‌ భరోసా

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ను విదేశాలకు తరలిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ మెగా లీగ్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహిస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ భరోసా ఇచ్చాడు. ఎన్నికల షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. తదనుగుణంగా మ్యాచ్‌ల తేదీలను నిర్ణయిస్తామన్నాడు. కాగా, ఐపీఎల్‌ను వచ్చే నెల 22 నుంచి రెండు దశలుగా నిర్వహించనున్నారని సమాచారం.

Updated Date - Feb 15 , 2024 | 03:44 AM