భారత్లోనే ఐపీఎల్
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:44 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ను విదేశాలకు తరలిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ మెగా లీగ్ను పూర్తిగా భారత్లోనే నిర్వహిస్తామని...
![భారత్లోనే ఐపీఎల్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
లీగ్ చైర్మన్ ధూమల్ భరోసా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ను విదేశాలకు తరలిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ మెగా లీగ్ను పూర్తిగా భారత్లోనే నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ భరోసా ఇచ్చాడు. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. తదనుగుణంగా మ్యాచ్ల తేదీలను నిర్ణయిస్తామన్నాడు. కాగా, ఐపీఎల్ను వచ్చే నెల 22 నుంచి రెండు దశలుగా నిర్వహించనున్నారని సమాచారం.