తుపాకీ నీడన ఇండో-పాక్ మ్యాచ్?
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:55 AM
ఇండో-పాక్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉందనే వార్తలు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8 మ్యాచ్లకు వేదికైన ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియంలో..
![తుపాకీ నీడన ఇండో-పాక్ మ్యాచ్?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూయార్క్: ఇండో-పాక్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉందనే వార్తలు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8 మ్యాచ్లకు వేదికైన ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ల సమయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. ఈ క్రమంలో స్పెషలిస్ట్ స్నైపర్లను కూడా మోహరించినట్టు సమాచారం. ప్రస్తుతం స్టేడియం వద్ద 24 గంటలూ గస్తీ కాస్తున్నారు. ఆదివారం ఇక్కడ జరిగే మ్యాచ్లో భారత్, పాక్ తలపడనున్నాయి.