ఆసియా స్క్వాష్లో డబుల్ ధమాకా
ABN , Publish Date - Jul 08 , 2024 | 06:13 AM
ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్షి్పలో భారత్ డబుల్ ధమాకా సాధించింది. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్క్వాష్ ప్లేయర్లు టైటిళ్లు కొల్లగొట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్ సింగ్-సెంథిల్ కుమార్ జోడీ

జోహోర్ (మలేసియా): ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్షి్పలో భారత్ డబుల్ ధమాకా సాధించింది. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్క్వాష్ ప్లేయర్లు టైటిళ్లు కొల్లగొట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్ సింగ్-సెంథిల్ కుమార్ జోడీ 11-4, 11-5తో ఒంగ్ సాయి హుంగ్-సయఫిక్ కమల్ (మలేసియా) ద్వయాన్ని ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం జరిగిన మిక్స్డ్ తుదిపోరులో భారత జంట అభయ్-జోష్నా చిన్నప్ప 11-8, 10-11, 11-5తో టాంగ్ వింగ్-టాంగ్ మింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి టైటిల్ అందుకుంది.