Share News

మహిళా ఫుట్‌బాలర్లపై దాడుల కేసులో.. దీపక్‌ శర్మపై వేటు

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:33 AM

ఇద్దరు మహిళా ఫుట్‌బాలర్లపై భౌతిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) ఈసీ సభ్యుడు దీపక్‌ శర్మపై సస్పెన్షన్‌ వేటుపడింది...

మహిళా ఫుట్‌బాలర్లపై దాడుల కేసులో..  దీపక్‌ శర్మపై వేటు

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళా ఫుట్‌బాలర్లపై భౌతిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) ఈసీ సభ్యుడు దీపక్‌ శర్మపై సస్పెన్షన్‌ వేటుపడింది. విచారణ ప్రక్రియలో భాగంగా దీపక్‌ నుంచి వివరాలు తీసుకొన్న అత్యవసర కమిటీ.. ఈ కేసును క్రమశిక్షణా సంఘానికి సిఫార్సు చేసింది. మహిళల ఫుట్‌బాల్‌ సెకండ్‌ డివిజన్‌ లీగ్‌లో పాల్గొనేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ‘ఖాద్‌ ఎఫ్‌సీ’ జట్టు గోవాకు వచ్చింది. అయితే, ఆ టీమ్‌ యజమాని కూడా అయిన దీపక్‌.. తాగిన మైకంలో బలవంతంగా తమ రూమ్‌లోకి చొరబడి తమపై దాడి చేశాడని ఖాద్‌ ఎఫ్‌సీ బాధిత ప్లేయర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆటకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని శర్మను ఏఐఎ్‌ఫఎఫ్‌ ఆదేశించింది.

Updated Date - Apr 03 , 2024 | 01:33 AM