Share News

హైదరాబాద్‌ ఘన విజయం

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:33 AM

రంజీట్రోఫీలో హైదరాబాద్‌ ఘనమైన బోణీ చేసింది. ప్లేట్‌ గ్రూప్‌లో భాగంగా..రెండు రోజుల్లోపే ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 194 పరుగులతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది...

హైదరాబాద్‌ ఘన విజయం

దిమాపూర్‌: రంజీట్రోఫీలో హైదరాబాద్‌ ఘనమైన బోణీ చేసింది. ప్లేట్‌ గ్రూప్‌లో భాగంగా..రెండు రోజుల్లోపే ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 194 పరుగులతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ 35/1 స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన నాగాలాండ్‌ 153 పరుగులకు ఆలౌటైంది. జగన్నాథ్‌ శీనివాస్‌ (49 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. తనయ్‌ త్యాగరాజన్‌ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 127 పరుగులకే కుప్పకూలింది. సుమిత్‌ కుమార్‌ (62) అర్ధ శతకం సాధించారు. మిలింద్‌ నాలుగు, తనయ్‌ త్యాగరాజన్‌ మూడు వికెట్లు తీశారు. హైదరాబాద్‌ మొదటి ఇన్నింగ్స్‌ను 474/5 స్కోరుతో డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసింది.

Updated Date - Jan 07 , 2024 | 06:45 AM