Share News

కాజల్‌కు స్వర్ణం

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:37 AM

అండర్‌-17 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా రెజ్లర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం మన మహిళలు స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల 69 కి. ఫైనల్లో ఒలెక్సాండ్రా (ఉక్రెయిన్‌)ను 9-2తో

కాజల్‌కు స్వర్ణం

అమ్మాన్‌ (జోర్డాన్‌): అండర్‌-17 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా రెజ్లర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం మన మహిళలు స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల 69 కి. ఫైనల్లో ఒలెక్సాండ్రా (ఉక్రెయిన్‌)ను 9-2తో చిత్తు చేసిన కాజల్‌ స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఇక..మహిళల 46 కి. స్వర్ణ పతక పోరులో యు కట్సుమి (జపాన్‌) చేతిలో ఓడిన శ్రుతిక రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 40 కి.లలో రాజ్‌బాల, మహిళల 53 కి.లలో ముస్కాన్‌ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అయితే పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఐదుగురు భారత రెజ్లర్లలో ఒక్కరు కూడా సెమీ్‌సకు చేరలేకపోయారు. కాగా..మహిళల ఫ్రీస్టయిల్‌లో గురువారం భారత్‌ నాలుగు స్వర్ణాలు సాధించిన విషయం విదితమే.

Updated Date - Aug 24 , 2024 | 06:37 AM