Share News

జాతీయ బాక్సింగ్‌లో అహ్మద్‌కు స్వర్ణం

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:28 AM

బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఎఫ్‌ఐ), ఖేలో ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాక్సర్‌ అహ్మద్‌ హష్మి స్వర్ణం...

జాతీయ బాక్సింగ్‌లో అహ్మద్‌కు స్వర్ణం

హైదరాబాద్‌ : బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఎఫ్‌ఐ), ఖేలో ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాక్సర్‌ అహ్మద్‌ హష్మి స్వర్ణం సాధించాడు. గుర్‌గావ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో జూనియర్‌ కేటగిరీ 33-35 కిలోల విభాగంలో అహ్మద్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అహ్మద్‌ 5-0 మెక్కాడెస్‌ (తమిళనాడు)ను చిత్తు చేశాడు.

Updated Date - Apr 08 , 2024 | 01:28 AM