గాయత్రి జోడీ సంచలనం
ABN , Publish Date - May 31 , 2024 | 05:51 AM
భారత యువ డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో గాయత్రి ద్వయం వరల్డ్ నెం.2 జోడీకి...
![గాయత్రి జోడీ సంచలనం](https://media.andhrajyothy.com/media/2024/20240530/5_Sports_c504a5e169.jpg)
ప్రీక్వార్టర్స్లో రెండో ర్యాంక్ జంటకు షాక్
మారిన్ చేతిలో సింధు ఓటమి
సింగపూర్: భారత యువ డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో గాయత్రి ద్వయం వరల్డ్ నెం.2 జోడీకి షాకిచ్చింది. గురువారం హోరాహోరీగా జరిగిన మహిళల డబుల్స్ పోరులో గాయత్రి/జాలీ జంట 21-9, 14-21, 21-15తో బేక్ హా/లీ సో (దక్షిణ కొరియా) జంటను కంగుతినిపించి క్వార్టర్ఫైనల్ చేరింది. ఇక స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఒలింపిక్ మాజీ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో మరోసారి ఓటమి చవిచూసింది. మూడు గేమ్లపాటు సాగిన ప్రీక్వార్టర్స్లో సింధు 21-13, 11-21, 20-22తో మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. కరోలినా చేతిలో సింధుకిది వరుసగా ఆరో పరాజయం. ఓవరాల్గా సింధుతో 17 ముఖాముఖి మ్యాచుల్లో మారిన్కిది 12వ విజయం. పురుషుల సింగిల్స్లో హెచ్ఎ్స ప్రణయ్ 13-21, 21-14, 15-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.