Share News

సింధు ముందంజ

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:30 AM

పీవీ సింధు స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ముం దంజ వేసింది. సింధు 21-14, 21-12తో హువాంగ్‌ యు స్యూన్‌ (తైపీ)ని ఓడించి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే సిక్కిరెడ్డి/సుమిత్‌ జోడీ మిక్స్‌డ్‌ లో...

సింధు ముందంజ

స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీ

మాడ్రిడ్‌: పీవీ సింధు స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ముం దంజ వేసింది. సింధు 21-14, 21-12తో హువాంగ్‌ యు స్యూన్‌ (తైపీ)ని ఓడించి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే సిక్కిరెడ్డి/సుమిత్‌ జోడీ మిక్స్‌డ్‌ లో 22-20, 21-18తో స్మిత్‌/లీ (అమెరికా)ను ఓడించి క్వార్టర్స్‌ చేరింది. మహిళల డబుల్స్‌లో అశ్విని/తనీషా జోడీ 21-14, 21-18తో టిఫానీ/గ్రోన్యా (ఆస్ర్టేలియా)పై నెగ్గి రౌండ్‌-8లో ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్‌/ధ్రువ్‌ కపిల జోడీ, అలాగే కృష్ణప్రసాద్‌/సాయి ప్రతీక్‌ ఓటమి పాల య్యారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఓడిన కిడాంబి శ్రీకాంత్‌ తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాడు. కొ టకాహషి (జపాన్‌)తో జరిగిన మొదటి రౌండ్‌లో శ్రీకాంత్‌ 18-21, 15-21తో పరాజయం పాలయ్యాడు.

Updated Date - Mar 29 , 2024 | 02:30 AM