Share News

ఫేవరెట్లు మను, ఇషా

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:11 AM

పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత పిస్టల్‌, రైఫిల్‌ జట్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది. మహిళల 25 మీ. పిస్టల్‌ విభాగంలో ఒలింపియన్‌ మనూ భాకర్‌, హైదరాబాద్‌ టీనేజ్‌ షూటర్‌ ఇషాసింగ్‌ తిరుగులేని...

ఫేవరెట్లు మను, ఇషా

నేటినుంచి ఒలింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత పిస్టల్‌, రైఫిల్‌ జట్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది. మహిళల 25 మీ. పిస్టల్‌ విభాగంలో ఒలింపియన్‌ మనూ భాకర్‌, హైదరాబాద్‌ టీనేజ్‌ షూటర్‌ ఇషాసింగ్‌ తిరుగులేని ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. తొలిరోజు ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ కేటగిరిలో అనీష్‌ భన్వాలా, విజయ్‌ వీర్‌సింగ్‌ ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయి. మొత్తం 8 పిస్టల్‌, రైఫిల్‌ విభాగాలకు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచే షూటర్లకు పారిస్‌ బెర్త్‌ ఖాయమవుతుంది.

Updated Date - Apr 19 , 2024 | 02:11 AM