ఫేవరెట్ సింధు
ABN , Publish Date - May 21 , 2024 | 01:15 AM
ఆటకు స్వల్ప విరామం ఇచ్చిన ఏస్ షట్లర్ పీవీ సింధు.. మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకొని...
![ఫేవరెట్ సింధు](https://media.andhrajyothy.com/media/2024/20240511/3_Sports_19fc72d8b1.jpg)
మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: ఆటకు స్వల్ప విరామం ఇచ్చిన ఏస్ షట్లర్ పీవీ సింధు.. మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సింధు ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఉబెర్ కప్, థాయ్ ఓపెన్ల నుంచి తప్పుకొన్న సింధు.. పారిస్ ఒలింపిక్స్ ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకొంటోంది. తొలి రౌండ్లో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో సింధు తలపడనుంది. అన్ సి యంగ్, చెన్ యు ఫీ, యమగూచి, కరోలినా మారిన్ లాంటి స్టార్ షట్లర్లు ఈ టోర్నీకి దూరం కావడంతో.. సింధు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అస్మిత చలీహా, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల్లో కిరణ్ జార్జ్ ఒక్కడే పోటీలో ఉన్నాడు. డబుల్స్లో ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెలతోపాటు పాలక్-ఉన్నతి, రితుపర్ణ-శ్వేతపర్ణ, సిమ్రన్-రితిక, కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్ జంటలు బరిలోకి దిగనున్నాయి. మిక్స్డ్లో సిక్కిరెడ్డి-సుమీత్ జోడీ కూడా ఆడనుంది.