Share News

అంపైరింగ్‌కు ఎరాస్మస్‌ గుడ్‌బై

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:16 AM

దక్షిణాఫ్రికాకు చెందిన అంపైర్‌ మరైస్‌ ఎరాస్మస్‌ (60) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో, ఆఖరి టెస్ట్‌ అతడికి...

అంపైరింగ్‌కు ఎరాస్మస్‌ గుడ్‌బై

దుబాయ్‌: దక్షిణాఫ్రికాకు చెందిన అంపైర్‌ మరైస్‌ ఎరాస్మస్‌ (60) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో, ఆఖరి టెస్ట్‌ అతడికి చివరి మ్యాచ్‌. నాలుగు వన్డే వరల్డ్‌క్‌పలు, ఏడు టీ20 ప్రపంచక్‌పలు, మూడు మహిళల టీ20 విశ్వకప్‌లతోపాటు 2013, 2017 చాంపియన్స్‌ట్రోఫీల్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2006లో కెరీర్‌ ఆరంభించిన ఎరాస్మస్‌ 81 టెస్ట్‌లు, 124 వన్డేలు, 43 టీ20లు, 18 మహిళల టీ20లకు అంపైరింగ్‌ చేశాడు. 131 మ్యాచ్‌లకు టీవీ రెఫరీగా వ్యవహరించాడు. 2010లో ఐసీసీ ఎలిట్‌ ప్యానల్‌ అంపైర్‌గా నియమితుడయ్యాడు.

Updated Date - Mar 08 , 2024 | 02:16 AM