Share News

రాజ్‌కోట్‌ చేరిన ఇంగ్లండ్‌ జట్టు

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:29 AM

రెండో టెస్టు ముగిశాక సుదీర్ఘ విరామం లభించడంతో ఇంగ్లండ్‌ జట్టు అబుధాబికి వెళ్లింది. వారం రోజులపాటు అక్కడి తమ శిబిరంలో సేద తీరడంతో పాటు...

రాజ్‌కోట్‌ చేరిన ఇంగ్లండ్‌ జట్టు

రాజ్‌కోట్‌: రెండో టెస్టు ముగిశాక సుదీర్ఘ విరామం లభించడంతో ఇంగ్లండ్‌ జట్టు అబుధాబికి వెళ్లింది. వారం రోజులపాటు అక్కడి తమ శిబిరంలో సేద తీరడంతో పాటు క్రికెటర్లు గోల్ఫ్‌ సైతం ఆడారు. అయితే ఈనెల 15 నుంచి జరిగే మూడో టెస్టు కోసం స్టోక్స్‌ సేన తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. సోమవారం సాయంత్రం వీరంతా రాజ్‌కోట్‌కు చేరుకున్నా రు. అలాగే మంగళవారం నుంచి ఇక్కడి ఎస్‌సీఏ స్టేడియంలో సాధన ఆరంభించనుంది.

Updated Date - Feb 13 , 2024 | 05:29 AM