పసిడి పోరుకు ధీరజ్ టీమ్
ABN , Publish Date - Apr 26 , 2024 | 03:39 AM
ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-1లో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర నేతృత్వంలోని భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకోగా...
సెమీస్లో జ్యోతి సురేఖ
షాంఘై: ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-1లో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర నేతృత్వంలోని భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకోగా.. కాంపాండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, ప్రియాన్ష్ సెమీస్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన రికర్వ్ టీమ్ సెమీస్లో ధీరజ్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ త్రయం 5-1తో ఇటలీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో కొరియాతో తలప డనుంది. కాగా, దీపిక, అంకిత, భజన్ కౌర్లతో కూడిన మహిళల జట్టు రెండో రౌండ్లో 3-5తో మెక్సికో చేతిలో ఓడింది. కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్ పోరులో జ్యోతిసురేఖ 143-142తో అవనీత్ కౌర్పై నెగ్గగా.. అదితి గోపీచంద్ 142-144తో బెసెర్రా (మెక్సికో) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల క్వార్టర్స్లో బటుహాన్ అకావ్గ్లూ (టర్కీ)పై ప్రియాన్ష్ టైబ్రేకర్లో నెగ్గాడు.