Share News

చాంపియన్‌కు రూ. 20.35 కోట్లు

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:02 AM

ఈసారి టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ ఎట్టకేలకు ప్రకటించింది. అంతేకాదు.. గత వరల్డ్‌ కప్‌ కంటే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీని భారీగా..

చాంపియన్‌కు రూ. 20.35 కోట్లు

  • రన్నర్‌పనకు రూ. 10.65 కోట్లు జూ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.50 కోట్లు జూ గతం కంటే రెట్టింపు

న్యూయార్క్‌: ఈసారి టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ ఎట్టకేలకు ప్రకటించింది. అంతేకాదు.. గత వరల్డ్‌ కప్‌ కంటే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈ వరల్డ్‌కప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.52 కోట్లుగా సోమవారం వెల్లడించింది. 2022 ప్రపంచ కప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 46.55 కోట్లు కాగా.. ఈసారి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఇక తాజా కప్పులో చాంపియన్‌గా నిలిచే జట్టు రూ. 20.36 కోట్లు అందుకోనుంది. గత టోర్నీలో విజేత ఇంగ్లండ్‌ జట్టుకు రూ. 13.30 కోట్లు దక్కాయి. ఇక ఈసారి రన్నర్‌పకు రూ. 10.65 కోట్లు లభిస్తాయి. క్రితంసారి ఫైనల్లో ఓడిన పాకిస్థాన్‌ రూ. 6.65 కోట్లతో సరిపెట్టుకుంది.

టీ20 ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ వివరాలివి..

  • సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు: చెరి 6.55 కోట్లు

  • సూపర్‌-8లో ఓడిన జట్లకు: తలో రూ. 3.18 కోట్లు

  • 9 నుంచి 12 స్థానాల్లో నిలిచే ప్రతీ జట్టుకు: రూ. 2.05 కోట్లు

  • 13 నుంచి 20 స్థానాలు: ఒక్కో జట్టుకు రూ. 1.87 కోట్లు

  • సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మినహా ఇతర మ్యాచ్‌ల్లో ఒక్కో విజయానికి తలో రూ. 26 లక్షలు అదనం.

Updated Date - Jun 04 , 2024 | 05:02 AM