బెంగాల్ శుభారంభం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:44 AM
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో బెంగాల్ వారియర్స్ శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ తొలిమ్యాచ్లో బెంగాల్ 32-29తో...

హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో బెంగాల్ వారియర్స్ శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ తొలిమ్యాచ్లో బెంగాల్ 32-29తో యూపీ యోధా్సపై గెలిచింది. హ్యాట్రి క్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యోధా్సను మూడు పాయింట్ల తేడా తో బెంగాల్ ఓడించింది. బెంగాల్ రైడ ర్లు మణిందర్ సింగ్ (8 పాయింట్లు), నితిన్ (7), సుశీల్ (7) సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 37-25 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది.