Share News

27 నుంచి ఆసియా యూత్‌ బాక్సింగ్‌ పోటీలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:03 AM

ఆసియా యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత బాక్సర్ల బృందాన్ని జాతీయ సమాఖ్య బుధవారం ప్రకటించింది. కజికిస్థాన్‌లోని అస్తానాలో...

27 నుంచి ఆసియా యూత్‌ బాక్సింగ్‌ పోటీలు

న్యూఢిల్లీ: ఆసియా యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత బాక్సర్ల బృందాన్ని జాతీయ సమాఖ్య బుధవారం ప్రకటించింది. కజికిస్థాన్‌లోని అస్తానాలో ఈనెల 27 నుంచి జరగనున్న ఈ పోటీల్లో 25 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ సాధించిన ప్రీతి పవార్‌ ఈ పోటీల్లో భారత బృందాన్ని నడిపించనుంది. ప్రీతి 54 కిలోల విభాగంలో తలపడనుండగా, అల్ఫియా పఠాన్‌ (81 కి.), ప్రస్తుత యూత్‌ వరల్డ్‌ చాంపియన్స్‌ దేవిక (52 కి.), విశ్వాంత్‌ సురేష్‌ (48 కి.), జాతీయ సీనియర్‌ చాంపియన్‌ ప్రాచి (63 కి.) తదితరులు బరిలోకి దిగుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 03:03 AM