అఖిల్ కంచు మోత
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:04 AM
: ఐఎ్సఎ్సఎఫ్ వరల్డ్ కప్లో చివరిరోజు భారత షూటర్ అఖిల్ షెరాన్ పతకంతో మెరిశాడు.
![అఖిల్ కంచు మోత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కైరో (ఈజిప్టు): ఐఎ్సఎ్సఎఫ్ వరల్డ్ కప్లో చివరిరోజు భారత షూటర్ అఖిల్ షెరాన్ పతకంతో మెరిశాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత ఈవెంట్లో అఖిల్ కాంస్యం సాధించాడు. ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేసి మూడోస్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్ షూటర్ జిరి ప్రిరాట్స్కీకి స్వర్ణం, ఫ్రాన్స్కు చెందిన రొమైన్ అఫ్రెరెకు రజతం లభించాయి. ఈ టోర్నీలో భారత షూటర్లు ఓవరాల్గా రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఓ కాంస్యం గెలిచారు.