Share News

IPl 2024: మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానుండగా.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:29 PM

ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Sunrisers Hyderabad vs Chennai Super Kings) మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒకవైపు.. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సన్‌రైజర్స్ మరోవైపు ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు మ్యాచ్‌కు వేదికైన ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

IPl 2024: మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానుండగా.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Sunrisers Hyderabad vs Chennai Super Kings) మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒకవైపు.. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సన్‌రైజర్స్ మరోవైపు ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.


అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు మ్యాచ్‌కు వేదికైన ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ నంబర్ 4వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ్యాచ్ టికెట్లు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు గేట్ దగ్గర ఉన్న బారికేడ్లని తోసేశారు. దీంతో పోలీసులు, క్రికెట్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాట కూడా జరిగింది.

Updated Date - Apr 05 , 2024 | 05:29 PM