ఏడు ఓటముల తర్వాత తలైవాస్..
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:18 AM
ప్రొ కబడ్డీలో తమిళ్ తలైవాస్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 46-27తో యూపీ యోధాస్పై విజయం సాధించింది...
ముంబై: ప్రొ కబడ్డీలో తమిళ్ తలైవాస్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 46-27తో యూపీ యోధాస్పై విజయం సాధించింది. తలైవాస్కు ఏడు వరుస ఓటముల తర్వాత ఇదే తొలి విజయం. తలైవాస్ స్టార్ రైడర్ నరీందర్ 14 పాయింట్లతో, కార్నర్ డిఫెండర్ సాహిల్ గులియా 5 ట్యాకిల్ పాయింట్లతో ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. హరియాణా స్టీలర్స్-యూ ముంబా మధ్య జరిగిన మ్యాచ్ 44-44తో టైగా ముగిసింది.