ఒలింపిక్స్కు 4 గీ 400 రిలే జట్లు
ABN , Publish Date - May 07 , 2024 | 02:14 AM
భారత పురుషులు, మహిళల 4గీ400 రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. వరల్డ్ అథ్లెటిక్స్ రిలేలో సోమవారం జరిగిన రెండో రౌండ్ హీట్స్లో తెలుగమ్మాయి...
నసౌ (బహమాస్): భారత పురుషులు, మహిళల 4గీ400 రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. వరల్డ్ అథ్లెటిక్స్ రిలేలో సోమవారం జరిగిన రెండో రౌండ్ హీట్స్లో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ, రూపల్, పూవమ్మ, శుభా వెంకటేశన్లతో కూడిన జట్టు 3 నిమిషాల 29.35 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచి పారి్సకు క్వాలిఫై అయింది. అనాస్, అజ్మల్, రాజీవ్, జాకబ్లతో కూడిన పురుషుల రిలే జట్టు 3 నిమిషాల 3.23 సెకన్లలో రేస్ పూర్తి చేసింది. అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచి పారిస్ బెర్త్ను పట్టేసింది.