Navya : కిస్మిస్ నీళ్లతో ప్రయోజనాలెన్నో!
ABN , Publish Date - May 15 , 2024 | 12:17 AM
కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతారు. మరికొందరు మెంతులు నానపెట్టిన నీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో కిస్మి్సలను నానపెట్టి వాటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
![Navya : కిస్మిస్ నీళ్లతో ప్రయోజనాలెన్నో!](https://media.andhrajyothy.com/media/2024/20240511/Untitled_3_copy_1f74c9c1c0.jpg)
కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతారు. మరికొందరు మెంతులు నానపెట్టిన నీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో కిస్మి్సలను నానపెట్టి వాటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఎలా తయారుచేయాలి?
ఒక పది కిస్మి్సలను తీసుకోవాలి. వాటిని ఒక గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ నీళ్లను ఉదయాన్నే లేచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా తాగాలి.
ప్రయోజనాలేమిటి?
ఈ నీళ్లలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల అజీర్తి తొలగిపోతుంది.
దీనిలో ఉండే ఐరన్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కణాలకు ఎంతో ఉపకరిస్తాయి.
పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణ జరుగుతుంది. హృద్రోగ సమస్యలు తొలగిపోతాయి.
ఈ నీళ్లలో ఉండే యాంటీ రాడికల్స్ వల్ల కణాలు ఆరోగ్యంగా తయారవుతాయి
కిస్మి్సలలో సహజసిద్ధమైన సుగర్ ఉంటుంది. కార్బోహైడ్రేడ్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణమే శక్తి కలుగుతుంది.
ఉదయాన్నే ఈ నీళ్లు తాగటం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వల్ల తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. బరువు తగ్గటానికి వీలవుతుంది.